తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి తెలంగాణ సాధన సభకు ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ నేతల ఐక్యత వల్ల ప్రజల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో తప్ప మిగతా పార్టీలతో తెలంగాణ రాదన్న నిజం ప్రజలకు తెలుసని అన్నారు. సోనియాతోనే తెలంగాణ సాధ్యమని పార్టీ కదిలిందన్నారు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకే ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు. తొందరలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్నారు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకే ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు. తొందరలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్నారు.
Tags: Telugu News, Andhra News, News
Blogger Comment
Facebook Comment